తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు లో ప్రధాన ముద్దగాయి గా ఉన్న మారతిరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన తన కూతురు విషయంలో తప్పు చేసినట్లు పశ్చతాప పడ్డట్టు తెలుస్తుంది.  అందుకే సూసైడ్ నోట్ లో అమృత అమ్మదగ్గరికి వెళ్లమ్మ అంటూ రాశారు.  కూతురు అమృత వేరే కులం యువకుడైన ప్రణయ్‌ని ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆ  యువకుడిని సుపారీ ఇచ్చి చంపించిన మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గది అద్దెకు తీసుకున్న  అర్థరాత్రి విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇటీవలే ఆయన బెయిల్ పై వచ్చిన విషయం తెలిసిందే.

 

అయితే మారుతిరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీడియా ఫోకస్ మొత్తం అమృతపై పడింది.  కానీ అమృత మాత్రం తన తల్లివద్దకు వెళ్లనని.. తన తండ్రి ఇలా చనిపోతారని ఊహించలేదని సమాధానం ఇస్తుంది.  ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఏ సంఘటన జరిగినా వెంటనే రియాక్ట్ అవుతూ తనదైన స్టైల్లో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అమృత విషయంలో కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.  మారుతీరావు ఆత్మహత్యపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందిస్తూ.. అమృత నిన్ను చూస్తే సిగ్గేస్తోంది అంటూ పోస్ట్ చేసింది. ఒకదశలో ఆయన ఆత్మహత్యకు నువు కూడా కారణం అని అంటూ ఆమె పోస్ట్ సారాంశం. 

 

శ్రీరెడ్డి పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.  ఓ వైపు కట్టుకున్నవాడు.. మరోవైపు తండ్రి ఇద్దరు లేకుండా పోయారు.. ఇలాంటి సమయంలో ఆమెకు సానుభూతి తెలపకుండా పిచ్చిపోస్టులు పెడతావా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తాంతో శ్రీరెడ్డి రియలైజ్ అయ్యారు.. సారీ అమృత.. నీ బాధను అర్ధం చేసుకోలేకయాను. అవగాహనా లేకుండా ఆ పోస్ట్ చేశాను. ఆదివారం నాటి పోస్టుపై రియలైజ్ అయ్యాను. నీవు చాలా కోల్పోయావ్ . నిన్ను, నీ బిడ్డను ఆ దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ మరో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: