తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుర్రాడు.. తాతకు తగ్గ మనవడు గా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.  బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎన్టీఆర్ తర్వాత నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారారు.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఇక ఆది, సింహాద్రి, యమదొంగ ఇలా వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  టెంపర్ చిత్రం తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.  నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని జూ.ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కుదిర్చించి పెద్దలు కుదిర్చినది.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. 

 


కుటుంబం అంటే ఎంతో ఇష్టపడే ఎన్టీఆర్ షూటింగ్ తర్వాత ఈ మాత్రం విరామం దొరికినా తన కుటుంబంతోనే ఎక్కువ కాలం గడిపేస్తుంటారు. షూటింగ్ స్పాట్ కు కూడా తన భార్య, పిల్లలను అప్పుడప్పుడు తీసుకొస్తుంటాడు.  తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ తర్వాత ఎక్కువ కుటుంబానికి ప్రాధాన్య ఇచ్చేవారిలో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీరంతా ఈ  ప్రతి పండుగ ఇతర ఈవెంట్స్ ఉన్నా వాటిలో పాాల్గొన్న తమ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంటారు.  తాజాగా ఎన్టీఆర్ మరో క్యూట్ పిక్ ను అభిమానులతో పంచుకున్నాడు.  ఈ రోజు హూలీ తన కుంటుం సభ్యులతో జరుపుకుంటున్నారు.

 


ఈ సందర్భంగా తన భార్య ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో తారక్ షేర్ చేశాడు. 'అందరికీ హోలీ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు.  ఈ పిక్ లో కుటుంబం అంతా తెల్లని బట్టలు వేసుకొని చిరు నవ్వులు చిందిస్తూ ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు.  రసాయనాలు లేని రంగులు ఇంకా చెప్పాలంటే స్వచ్ఛమైన పసుపుతో వారు హోలీ జరుపుకున్నట్టు ఈ పిక్ చూస్తుంటే అర్థం అవుతుంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: