సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేసింది. దీంతో మహేష్ బాబు, ఇంకా సరిలేరు చిత్రం బృందం కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు ఒక వెకేషన్ తీసుకొని విదేశాలకి తన కుటుంబ సమేతంగా వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఓ చిన్న విరామం తీసుకొని తరువాత తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి తో తీద్దామని అనుకున్నాడు మహేష్ బాబు. కానీ వంశీ పైడిపల్లి మాఫియా స్క్రిప్ట్ మహేష్ బాబు కు అంతగా నచ్చలేదు కాబట్టి అతనితో తన నెక్స్ట్ సినిమా తీసేందుకు ప్రిన్స్ ససేమిరా అన్నాడు. ఐతే ప్రస్తుతం మరొక కొత్త స్క్రిప్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ అది దొరికేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకే తన ఖాళీ సమయాన్ని ప్రత్యేకంగా గడపాలని మహేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు.



తన నిర్ణయం ప్రకారం... ఒక ఆధ్యాత్మిక యాత్ర కు ప్లాన్ రూపొందించుకున్న మహేష్ బాబు... అందుకు హిమాలయాలను సరైన ప్లేస్ గా ఎన్నుకున్నాడు. అందుకే త్వరలోనే తట్టాబుట్టా సర్దుకుని చాలా ప్రశాంతమైన, రమణీయమైన, అద్భుతమైన హిమాలయాలకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. అయితే మనకు తెలిసిన హీరోలలో రజనీకాంత్ ఒక్కడే హిమాలయాలకు వెళ్ళి తన సమయాన్ని గడుపుతాడు. రోబో సినిమా తీసిన తర్వాత రజినీకాంత్ మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్తున్నట్టు చెప్పారు అన్న సంగతి తెలిసిందే. అయితే మనం ఎన్నడూ మహేష్ బాబు హిమాలయాలకు వెళతాడని ఊహించలేదు కానీ మహేష్ ఈ నిర్ణయం సడన్ గా తీసుకొని తన ఫాన్స్ ని ఆశ్చర్య పరుస్తున్నాడు.



ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి 152 సినిమా ఆచార్య లో మహేష్ బాబు ఒక కీలకమైన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తాడని సినీ వర్గాల నుండి వార్తలు వెల్లువెత్తాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: