నిన్న మొన్నటి వరకూ జబర్దస్త్ దొరబాబు అంటే తెలియని వారికి కూడా, ఇటీవల విశాఖపట్నంలో ఓ వేశ్యా వాటికలో పట్టుబడ్డ దొరబాబు ఉదంతం అనంతరం.. అందరికి అతడు సుపరిచితుడయ్యాడు. ఇక తరువాత పరిణామాలు గురించి మనకు విదితేనే. ఇక్కడ కొసమెరుపు ఏమంటే, దొరబాబు భార్య అతనికి వత్తాసు పలకడమే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అతగాడి భార్య అయిన అనుకి టిక్‌టాక్‌తో మంచి ఫాలోయింగ్ ఉంది. బాబుకిలానే ఈమెకు కూడా కొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. 

 

అయితే దొరబాబు వెలగ బెట్టిన ఆ.. విషయంలో ఆమెను చాలా మంది అడగడంతో తన అభిప్రాయాన్ని ఓ పోస్ట్ ద్వారా క్లియర్ చేసింది నందు అలియాస్ నందిని. అదేమిటో ఆమె మాటలోనే.. ఒక వ్యక్తిని అపార్ధం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజా నిజాలు అర్థం అవుతాయి. ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోకూడదు’ అనే కొటేషన్‌ను తన టిక్ టాక్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. 

 

IHG

 

ఇక దీంతో ఈ పోస్ట్ చాలా ఫాస్టుగా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇక్కడ కొందరి నెటిజన్స్ కామెంట్స్ ని పరిశీలిద్దాం.. ఒకడు, "భర్త రెడ్ హ్యాండెడ్‌గా వ్యభిచారం వెలగబెడుతూ.. పోలీసులకు దొరికిపోతే, ఇంతిలా సపోర్ట్ చేసే భార్య ఎక్కడైనా దొరకుతుందా? అని ఒకడు.. "నీ భార్య రూపమే కాదు, మనసు కూడా  బంగారమే.. మరి నీకేం పాడు బుద్ధి పుట్టిందయ్యా! బాబూ" అని ఒకరు.. మరోవైపు "మేడమ్ యు అర్ గ్రేట్ .. భర్త ఎంత తప్పు చేసినా క్షమించే మీ గుణం లక్షల్లో ఒక్కరికే ఉంటుంది" అంటూ వేరొకరు దొరబాబు భార్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

ఇక మరి కొంతమంది అయితే, కొంచెం కొంటెగా.. "కళ్లు మోసం చేయడం ఏంటి మేడమ్? కళ్ల ముందే నీ మొగుడు, ఇంకో మహిళలో వ్యభిచారం చేస్తూ.. దొరికిపోతే.. ఇంకా ఆయన్ని వెనకేసుకొస్తున్నారా" అంటూ క్లాస్ తీసుకుంటున్నారు కొందరు... ఏది ఏమైనా.. జరగాల్సింది జరిగిపోయింది... అయితే దొరబాబు భార్య తన కాపురాన్ని చక్కదిద్దుకోవడంలో మాత్రం మెచ్యూర్డ్‌గా ఆలోచించే విధానాన్ని మాత్రం మనం హర్షించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: