టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఇప్పుడు ఆయన `ఎఫ్-2` కి సీక్వెల్ గా `ఎఫ్-3` స్క్రిప్టుని సిద్ధం చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. కాకపోతే ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరో టాప్ స్టార్ ని కలిపి ముగ్గురు స్టార్ హీరోలతో కామెడీ చెప్చేందుకు దర్శకుడు రెడీ అవుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు మూడో హీరోగా మాస్ రాజా రవితేజ, ప్రిన్స్ మహేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి మహేష్ నే యాక్ట్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేసేస్తూ ప్రచారమైంది.

 

 

 

దీనికి కారణం `సరిలేరు నీకెవ్వరు`లో రావిపూడి కామెడీ టైమింగ్ తో మహేష్ ఫుల్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఈ సీక్వెల్ కి మహేష్ అంగీకరించారని, అతడికి తగిన విధంగా స్క్రిప్టును మార్చారని ప్రచారం జరిగింది. ఈ ముగ్గురు హీరోలతో తెరనిండుగా కామెడీ ఫుల్ గా పండుతుందని ప్రచారమైంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ ఉన్నట్టా లేనట్టా? అన్నదానికి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన ఎక్కడ కూడా లేదు. కాకపోతే ప్రస్తుతం అనీల్ సన్నిహిత వర్గాల నుంచి అసలు సంగతి బయటికి వచ్చిందంట. అసలు ఈ స్క్రిప్ట్ లో మూడవ పాత్రకి ఛాన్సే లేదని రైటర్ టీమ్ నుంచి తెలిసిందంట. కాకపోతే ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని ఒక ప్రచారం సాగింది. అయితే అవన్నీ గాలి వార్తలే అని స్క్రిప్ట్ పండే పనుల్లోనే ఇటీవల టీం బిజీ అయ్యిందట. 

 

 


ఈ సినిమాలో తొలి భాగం ప్లేవర్ మిస్ అవ్వకుండా ఈసారి కామెడీని కొత్త తరహాలో కనిపించేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కామెడీ విషయమై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇకపోతే కామెడీ స్క్రిప్టులో మహేష్ నటించేంత స్కోప్ లేదని కూడా తెలుస్తోంది. ఇందులో ఒకవేళ ప్రత్నామ్యాయంగా మరో కామెడీ స్టార్ యాడ్ అవుతారా..? అంటే దానికి ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాలో మూడవ హీరో కి నో ఛాన్స్ అనే చెబుతున్నారు. మరీ కచ్చితంగా కావాలనుకుంటే మాస్ రాజా ఎలాగూ సిద్దంగా ఉంటాడు కాబట్టి అనీల్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: