పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు రెండో సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్ గా  మొదలు పెట్టేశాడు. ఫస్ట్ సినిమాకు హీరోయిన్ ఎవరా అని అందరూ ఆలోచిస్తుంటే..ఈయన మాత్రం రెండో సినిమాకోసం ఎంతమంది హీరోయిన్లు పోటీ పడ్డా కాదని ..తనతో సిల్వర్ జూబ్లీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ తో రెండో సారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు  పవర్ స్టార్ .

 

 

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడే  ..సెకండ్ సినిమాని క్రిష్ తో ఫైనల్ చేశాడు. ఎ.ఎమ్ రత్నం ప్రొడక్షన్ లో జానపద బ్యాక్ డ్రాప్ లో వచ్చే పీరియాడికల్  స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ  జరుగుతుంది. 

 

 

రత్నం  ప్రొడక్షన్ లో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో  పవన్ కళ్యాన్ కు జంటగా ఏ హీరోయిన్ ని పెడదాం అని చాల కాలం నుంచి ఆలోచిస్తున్నారు మేకర్స్. పీరియాడికల్ స్టోరీ కాబట్టి.. ఎమోషన్స్ , ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ఇంటెన్స్ లెవల్లో పలికించగలిగే హీరోయిన్ ని తీసుకుందామని డిసైడ్ అయ్యారు క్రిష్. సో.. బెస్ట్ ఆఫ్షన్ గా మహానటిలో లీడ్ రోల్ చేసి పవన్ పక్కన ..సెట్ అయ్యేలా కనిపించిన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా డిసైడ్ చేశారు. 

 

 

కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ సినిమా చేసింది. పవన్ కళ్యాణ్ 25 వ సినిమా అగ్నాతవాసి లో కీర్తి కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్ . అంతకుముందు సినిమాల్లో లా కాకుండా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా మోడరన్ గా కనిపించి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. వీళ్ల పెయిర్ కూడా బావుండడంతో పవన్ కళ్యాణ్ కి జంటగా కీర్తి సురేష్ నే ఖాయం చేశారు హీరోతో పాటు దర్శకనిర్మాతలు. ఇలా రెండో సారి క్రిష్ సినిమాలో  పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది కీర్తిసురేష్. మరి వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఈ సారి ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: