టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల బాహుబలి రెండు భాగాలతో అత్యద్భుత విజయాలు అందుకోవడంతో పాటు హోల్ ఇండియా లోనే హీరోగా ఎంతో గొప్ప క్రేజ్ ని సంపాదించడం జరిగింది. ఇక దానితో ఆయన మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగి, బాలీవుడ్ నటుల స్థాయికి చేరుకుంది. ఇక గత ఏడాది సాహో వంటి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ సినిమాతో పెద్దగా సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న జాన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

 

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూరోప్ బ్యాక్ డ్రాప్ లో కొన్నేళ్ల క్రితం జరిగిన అందమైన ప్రేమకథగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్స్ ని నిర్మాతల్లో ఒకరైన యువి క్రియేషన్స్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులు, ప్రేక్షకులకు తెల్పడం జరిగింది. ప్రస్తుతం జరిగిన షెడ్యూల్ లో ఒక అద్భుతమైన ఛేజ్ సీక్వెన్స్ ని పలువురు ఇంటర్నేషనల్ క్రూ సభ్యులతో కలిసి మా సినిమా యూనిట్ చిత్రీకరించింది. అతి త్వరలో యూరోప్ లో జరుగబోయే భారీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ వారు పోస్ట్ చేయడం జరిగింది. 

 

కాగా ఈ సినిమా కోసం ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ చేసిన యూనిట్, ఆ సెట్టింగులు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు సమాచారం. యువి క్రియేషన్స్ తో పాటు గోపికృష్ణ మూవీస్ సంస్థ కలిసి ఎంతో భారీగా నిర్మస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: