అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్‌ శెట్టి దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది.  కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్  కంప్లీటైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ శెట్టి.. ముంబాయి‌లో ఇప్పటి వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 

అలాగే అజయ్ దేవ్‌గణ్ సింగం పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే.. రణ్‌వీర్ సింగ్ ‘సింబా’ గా అలరించనున్నాడు. మరోవైపు ముంబాయి బాంబ్ బ్లాస్ట్‌ల వెనక ఉన్ మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం పాత్రలో జాకీ ష్రాఫ్ నటించాడు. అయితే రోహిత్‌ శెట్టి హీరోయిన్‌ కత్రినా కైఫ్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కత్రినా కైఫ్‌ క్లైమాక్స్‌ సన్నివేశంలో రీటేక్‌ కావాలని  రోహిత్‌ను కోరింది. అప్పటికే ఒకే సన్నివేశాన్ని నాలుగుసార్లు చిత్రీకరించటంతో రోహిత్‌ దానికి అంగీకరించలేదు.

 

అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ లాంటి సూపర్‌ స్టార్‌లు నటిస్తున్న ఈ సన్నివేశంలో నిన్ను ఎవరూ పట్టించుకోరని సమాధానమిచ్చారు. ఇది సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ మారింది. దీంతో క‌త్రినా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్ర‌హించి.. అనేక ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో స్పందించిన క‌త్రినా..`` ప్రియమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు... నేను సాధారణంగా ఇలాంటి వార్తలపై స్పందించను. కానీ రోహిత్‌ సర్‌ విషయంలో నేను మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకంటే మీరంతా ఆయనను అపార్థం చేసుకున్నారు.`` నిజానికి రోహిత్ సార్‌.. అలా అన‌లేదు. ఆ సీన్‌లో నేను కళ్లు మూసినట్లుగా కనిపించడంతో మళ్లీ టేక్‌ చేద్దాం అన్నాను.

 

అయితే రోహిత్‌ సర్‌ మాత్రం..అది బ్లాస్ట్‌ సీన్‌ కాబట్టి ఎవరూ అంతగా ఈ విషయాన్ని పట్టించుకోరు అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయనే మళ్లీ మరో టేక్‌ చేద్దామని నాతో అన్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మ‌రియు ఆయన ఎల్లప్పుడూ నాకు స్నేహితుడే.. కాబ‌ట్టి.. ప్లీజ్ ఆయ‌న‌న్ను అపార్థం చేసుకోకండి అంటూ విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ శాంతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: