దిల్ రాజు, బోని కపూర్ నిర్మాతలుగా, వేణు శ్రీరాం దర్శకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో పింక్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ  సినిమాను బోని కపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నా కొన్ని కారణాలతో విడుదలను కొన్నాళ్ళు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

త్వరలో ఈ సినిమా విడుదల తేదీ పై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా విషయంలో పట్టుదలగా ఉన్నారు. పవన్ కి సరైన హిట్ వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే సూచనలు కనపడుతున్నాయి. 

 

గ‌తంలో వీరిద్ద‌రూ ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌’, ‘కాట‌మ‌రాయుడు’ చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు శృతి ఖరారు అయితే వీరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా అవుతుంది టాలీవుడ్ లో. ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల్లో ప‌వ‌న్ జ‌త‌గా శృతి ని ఎంపిక చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. మే 15 న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: