పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు.  అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా పరిచయం అయిన పవన్ కళ్యాన్ ముందు నుంచి తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని తాపత్రయపడేవారు.  తమ్ముడు, తొలిప్రేమ,సుస్వాగతం చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జల్సా’ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది.  మాస్ ఆడియాన్స్ కి బాగా కనెక్ట్ అయిన పవన్ కళ్యాన్ తర్వాత ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తున్నా అంటు వెళ్లారు. 

 

అయితే ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని పొందారు.  దాంతో ఇప్పుడు మళ్లీ ఇండస్గ్రీవైపు వచ్చారు.  ప్రసుతం శ్రీరామ్ దర్శకత్వంలో తన 26 చిత్రం‘ వకీల్ సాబ్ ’ లో నటిస్తున్నారు పవన్ కళ్యాన్. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పణ.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా నడుస్తుంది.  బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్ ’ రిమేక్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.  తమిళంలో అజిత్ హీరోగా నటించారు.  అయితే  ‘పింక్’ ఒరిజినల్ వెర్షన్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లేదు. ఇప్పుడు పవన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఓ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నారట దర్శకులు. 

 

ఇది సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.  ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మగువ మగువ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.   తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.  మరోవైపు ఎస్ఎస్ తమన్ మంచి మ్యూజికల్ హిట్ చేయాలనన్న ఉద్దేశంతో తెగ కష్టపడిపోతున్నారట. ఈ చిత్రం పూర్తయ్యాక క్రిష్ డైరెక్షన్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: