హీరోయిన్లు ఒక్కసారి స్లో ఫేజ్ లో పడిపోతే మళ్లీ ఫామ్ అందుకోవడం కష్టం. స్లంపు నుంచి క్లైమాక్స్ కు వెళ్లడమే కానీ.. ట్రాక్ ఎక్కలేదు అంటారు. కానీ కొందరు  హీరోయిన్లు మాత్రం ఈ మాటలను చెరిపివేసేందుకు పోరాటం చేస్తున్నారు. రీఎంట్రీతో సూపర్ స్టార్డమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

 

శృతిహాసన్ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయి మూడేళ్లు అవుతోంది. కాటమరాయుడు తర్వాత తెలుగులో సినిమాలకు బ్రేక్ ఇచ్చి. కోలీవుడ్, బాలీవుడ్ టు చెన్నై, ముంబయిలకే పరిమితమైంది. పైగా శృతిహాసన్ వెయిట్ పెరగడంతో ఇక్కడి స్టార్ ఈ హీరోయిన్ ని లైట్ తీసుకున్నారు. దీంతో శృతిహాసన్ కెరీర్ క్లైమాక్స్ కు చేరిందనే కామెంట్స్ వచ్చాయి.  

 

శృతిహాసన్ ని తెలుగు ప్రేక్షకులు కూడా మరిచిపోతున్న టైమ్ లో క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రవితేజతో జోడీ కట్టింది శ్రుతీ. ఇక ఈమూవీ సెట్స్ లో ఉండగానే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో శృతిహీరోయిన్ అనే టాక్ వస్తోంది. ఇంతకుముందు వీళ్ల ముగ్గురి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది. 

 

అమలాపాల్ పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకొని, ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయింది. అయితే ఎ.ఎల్ విజయ్ తో విడిపోయాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. విడాకుల గొడవని పక్కన పెట్టి ఆమె లో బోల్డ్ గా నటించింది. దీంతో సౌత్ లో చిన్నపాటి అలజడి మొదలైంది. ఈ అలజడి వెంకటేశ్ ని తాకి, నారప్ప సినిమాలో అవకాశం తెచ్చిపెట్టిందట. 

 

అమలాపాల్, తమిళ, మళయాళంలోనూ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. కోలీవుడ్ లో రెండు సినిమాలు, మాలీవుడ్ లో ఒక ప్రాజెక్టుకు సైన్ చేసింది అమల. ఇక తెలుగులో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది అమలా పాల్. సో ఈ హీరోయిన్లని చూస్తుంటే.. గ్యాప్ వస్తే కెరీ ఫట్టే అనే మాటలను చెరిపేస్తున్నట్టే కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: