తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన ‘మల్లీశ్వరి’ లో నటించింది. ఇక బాలయ్య నటించిన ‘అల్లరి పిడుగు’ చిత్రంలో గ్లామర్ పాత్రతో కవ్వించింది.  ఆ తర్వాత తెలుగు లో మళ్లీ కనిపించలేదు.  కాకపోతే కత్రినాతో పలువురు దర్శక, నిర్మాతలు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది.  అదే సమయంలో బాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లడంతో ఇతర భాషా చిత్రాలపై పెద్దగా ఇష్టం చూపించాలేదు కత్రినా కైఫ్. 

 

తాజాగా ఈ బ్యూటీ మరోసారి తెలుగు తెరపై కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహెూ’ పార్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది.  కాకపోతే ఈ చిత్రం బాలీవుడ్ లో పరవాలేదు అనిపించినా ఇతర భాషల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  వాస్తవానికి  ఈ చిత్రంలో ఎక్కువగా బాలీవుడ్ నటులు నటించారు.  ఇందులో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ నటించింది.  తాజాగా ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో ఆయన సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

 

ఆ తరువాత చిత్రంలోనూ బాలీవుడ్ భామనే ఆయన జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ హీరోయి బాలీవుడ్ బ్యూటీలు బాగా సెట్ అవుతున్నారు. దాంతో ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక  చిత్రం ప్లాన్ చేశాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని చెప్పాడు.  ఈ చిత్రంలో హీరోయిన్లుగా దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా అనుకున్నారు.  కానీ ఇప్పుడు తెరపైకి మరో హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.  ఇప్పుడు కత్రినా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఇదే గనక నిజమే అయితే.. సూపరో సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: