సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే చాలు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. దీనితో ఆయన సినిమాలకు ఒక తెలియని క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి సినిమా విడుదల అవుతుంది అంటే చాలు సెలవులు పెట్టుకుని కూడా చూసే వాళ్ళు జనం. చిరంజీవి సినిమాలు చెయ్యాలని ఎందరో అభిమానులు కోరుకున్నారు. దీనితో ఆయన పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమాను చేసారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. 

 

ఆ తర్వాత రెండేళ్ళు సమయం తీసుకుని సైరా అనే సినిమా చేసారు. ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ సినిమా వలన నిర్మాత రామ్ చరణ్ కి నష్టాలు కూడా వచ్చాయని అంటున్నారు. దీనితో చిరంజీవి ఇప్పుడు తన సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. సినిమా నిర్మాత తన కొడుకు కావడం రీ ఎంట్రీ తర్వాత ఒక్క సినిమానే హిట్ అవ్వడంతో చిరంజీవికి ఈ సినిమా విజయం అనేది చాలా అవసరం అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ఆయన రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. తన వలన సినిమాకు ఏ నష్టం రానీయడం లేదు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా మీద రామ్ చరణ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సినిమా హిట్ అయితే నిర్మాతగా కూడా రామ్ చరణ్ కి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఫ్లాప్ అయితే మాత్రం అతను కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే బయ్యర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనితో ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా సీరియస్ గా ఉన్నారని, ఎలా అయినా సరే హిట్ కొట్టాలని భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: