టాలీవుడ్ హీరో నితిన్ రీసెంట్ గా భీష్మతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. నిర్మాతలతో సహా బయ్యర్లు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లినా పరీక్షలు లేకపోతే ఈ సినిమా ఇంకా వసూలు చేసేదని అంటున్నారు. నితిన్ కెరీర్లో ఉన్న హిట్ల అన్నింటిలోకి భీష్మ హిట్ పెద్దది. భీష్మ ఇచ్చిన జోష్ లో తన నెక్స్ట్ మూవీ రంగ్ దే.. లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తర్వాతి ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టిన నితన్ కాస్త ప్రయోగాలకు వెళుతున్నాడేమో అని అంటున్నారు.

 

 

రంగ్ దే సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోంది. ఇది కూడా అందమైన ఓ ప్రేమకధ అని చెప్తోంది చిత్ర బృందం. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ కానుంది. ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. భీష్మ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. దీని తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి సైన్ చేశాడు. కాన్సెప్ట్, టిపికల్ బేస్డ్ సబ్జెక్టులు తీయడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు. ఇప్పుడు కూడా చెస్ గేమ్ నేపథ్యంలో సబ్జెక్టును ఎంచుకున్నాడని సమాచారం. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే కథనంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

 

 

ఇప్పటికే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. హిందీలో హిట్టైన అంధాదూన్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇవన్నీ కొద్దిగా ప్రయోగాత్మకంగా ఉండే సినిమాలే. భీష్మతో ఎంటర్ టైన్మెంట్ జోనర్ లో వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నితిన్ కు ఇవన్నీ ప్రయోగాత్మక సినిమాల్లా అనిపిస్తున్నాయని అంటున్నారు. మరి నితిన్ చేయబోయే సినిమాల్లో తనకు క్లారిటీ ఉంటే మళ్లీ విజయాలు ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: