వివాదాస్పద వ్యాఖ్యలతో, పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి మరోసారి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీలను టార్గెట్ చేసి వార్తల్లో నిలిచారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రముఖ హీరోను, ప్రముఖ నిర్మాత తనయుడిని, కొందరు దర్శకులను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి చెన్నైకు వెళ్లిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. చెన్నైలో చిన్న సినిమాల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం తగ్గించారు అనుకునేంతలో మరలా వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచారు. 
 
కొద్ది రోజుల క్రితం రాకేష్ మాస్టర్, కళ్యాణిలను టార్గెట్ చేసి ఫేస్ బుక్ లో శ్రీ రెడ్డి వివాదాస్పద పోస్టులు పెట్టారు. రాకేష్ మాస్టర్ శ్రీ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా ఫేస్ బుక్ లో చార్మింగ్ పూరీ అని శ్రీ రెడ్డి పోస్ట్ చేశారు. అకస్మాత్తుగా ఛార్మి, పూరీ జగన్నాథ్ లను శ్రీ రెడ్డి ఎందుకు టార్గెట్ చేసిందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. నిజానికి గతంలోనే పూరీ, ఛార్మి మధ్య రిలేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. 
 
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత ఛార్మి నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టింది. పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంది. నిర్మాతగా మొదట్లో కోట్ల రూపాయలు నష్టపోయిన ఛార్మి ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సక్సెస్ చవిచూసింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో భారీ మొత్తంలో ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన ఛార్మి, పూరీ జగన్నాథ్ లకు లాభాలు వచ్చాయి. 
 
గతంలో వీరిద్దరి మధ్య బంధం గురించి వార్తలు వచ్చినా వీరి సాన్నిహిత్యం మాత్రం అలాగే కొనసాగుతోంది. శ్రీ రెడ్డి చేసిన పోస్టు పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చూసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అకస్మాత్తుగా ఛార్మి, పూరీ జగన్నాథ్ లను శ్రీ రెడ్డి ఎందుకు టార్గెట్ చేసిందో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: