యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నారు. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుదన్నది మాత్రం చెప్పలేదు. ఇదిలాఉంటే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా నాగ్ అశ్విన్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని పట్టుపడుతున్నాడట ప్రభాస్.

 

ఇంతకీ ప్రభాస్ ఒత్తిడి తెస్తున్న ఆ హీరోయిన్ ఎవరు అంటే కత్రినా కైఫ్ అని తెలుస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన కత్రినా ఇప్పటికి అదే ఫాం కొనసాగిస్తుంది. అసలు సాహో సినిమాలో కూడా కత్రినాను తీసుకోవాలని అనుకున్నారు కాని ఆమె డేట్స్ ఖాళీగా లేవని శ్రద్ధా కపూర్ ని ఫైనల్ చేశారు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాకు కత్రినా కోసం ప్రయత్నిస్తున్నారట. కత్రినా కూడా ప్రభాస్ తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకునే ఛాన్స్ ఉండదు.

 

బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ పై ప్రభాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కత్రినా ఓకే అంటే చాలు ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా సిద్ధం అంటున్నారట. వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. తప్పకుండా ఈ కాంబో సినిమా సంచలనం కాబోతుందని మాత్రం చెప్పొచ్చు. సినిమా స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. మరి కత్రినా కైఫ్ ప్రభాస్ జోడీ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: