టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బాబు నటించిన అన్ని సినిమాలలో రాయలసీమ తరహా టైపు చేసిన సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అప్పట్లో రాయలసీమ నేపథ్యంలో బాలక్రిష్ణ నటించిన సమరసింహా రెడ్డి మరియు నరసింహ నాయుడు, సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ అప్పట్లో దూసుకెళ్లి పోయారు. అనేక రికార్డులు క్రియేట్ చేసారు. ఆ రెండు సినిమాలు దర్శకత్వం చేసింది బి.గోపాల్. ఆ రెండు మాత్రమే కాకుండా రౌడీ ఇన్స్పెక్టర్ మరియు లారీ డ్రైవర్ ఇలాంటి సినిమాలను బాలకృష్ణ కెరీర్లో మర్చిపోలేని హిట్లు అందించారు. వీరిద్దరి కలయికలో ఏదైనా సినిమా వస్తుందంటే కచ్చితంగా...ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మరో సినిమా రిలీజ్ చేసే వాళ్ళు కాదు. అంతగా బి.గోపాల్ మరియు బాలకృష్ణ సినిమాకి క్రేజ్ ఉండేది.

 

అలాంటిది వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పల్నాటి బ్రహ్మ నాయుడు’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాలేదు. సంవత్సరాలు గడిచిన వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని అందరూ భావించినా గానీ ఎటువంటి రెస్పాండ్ రాలేదు. అటువంటిది వీరిద్దరి కాంబినేషన్ ను కలిపే బాధ్యతను చిన్నికృష్ణ తీసుకున్నారు. ఓ అద్భుతమైన కథను బాలయ్యకు వినిపించాడు చిన్నికృష్ణ. ఈ కథను కేవలం బాలయ్య కోసమే తయారుచేశానంటున్న చిన్నికృష్ణ.. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

 

అయితే బాలకృష్ణ తో తీసిన అనుభవం వి గోపాల్ కి ఉండటంతో స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ బాలకృష్ణకి వినిపించారు.  దీంతో బి.గోపాల్ సూచించిన మార్పులు చేర్పులు తర్వాత స్క్రిప్ట్ కి బాలకృష్ణ ఫిదా అయిపోయారు అని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే బి.గోపాల్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: