నేచురల్ స్టార్ నానీకి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ బ్రేకులేసినట్టు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో పీఆర్ టీమ్ కు అతి తగ్గించుకోవాలని చెప్పాడట. వన్ సైడ్ ప్రమోషన్ మంచిది కాదంటూ ఇంద్రగంటి నాని అండ్ టీమ్ ను మందలించినట్టు వినిపిస్తోంది. ఇంతకీ నేచురల్ స్టార్ అండ్ కో చేసిన అతి ఏంటీ.. డైరెక్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో చూద్దాం..

 

అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసుకుంటున్న నానీని ఇంద్రమోహన్ కృష్మ అష్టాచెమ్మా సినిమాతో హీరోను చేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడం.. నటుడిగా నానీలో సత్తా ఉండటంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన జెంటిల్ మేన్ కూడా కమర్షియల్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీ సినిమాతో రాబోతున్నారు. 

 

వి సినిమాలో నాని, సుధీర్ బాబు నటిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో మాత్రం ఇది నానీ సినిమా అన్నట్టు నానీ ఇంటర్నల్ గా పీఆర్ టీమ్ కు చెప్పినట్టు టాక్. టీజర్ రిలీజైనపుడు హ్యాష్ ట్యాగ్స్ లో నానీ వీ టీజర్ అని పోస్టులు చేయించాడట. దీంతో అప్సెట్ అయిన సుధీర్ బాబు ఈవిషయం దర్శకుడు ఇంద్రగంటికి చెప్పాడట. వెంటనే పీఆర్ ను పిలిపించి పబ్లిసిటీలో నానీకి ఎంత వెయిటేజ్ ఇస్తారో సుధీర్ బాబుకు అంతే వెయిటేజ్ ఇవ్వాలని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. 

 

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణను నానీ గురువుగా భావిస్తాడు. అందుకే ఈ విషయంలో సైలెంట్ అయిపోయాడని టాక్. వీ సినిమా సక్సెస్ నానీకి, హీరో సుధీర్ బాబుకు కూడా వెరీ ఇంపార్టెంట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నివేదా థామస్, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు థ్రిల్ చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: