ఎవరో గానీ చీకట్లో భయపెడుతున్నారు. దాడి చేస్తున్నారు. ఎవరో చూద్దామంటే.. సరిగా కనిపించడం లేదు. 25ఏళ్ల అమ్మాయి ఇదంతా చేస్తుందన్న అనుమానం వచ్చింది. ఆమె ఒక్కటే ఇలా చేయలేదు. ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు. ఆ అదృశ్య హస్తం ఎవరో తెలుసుకోవాలంటే నిశ్శబ్దం హస్తం తెలుసుకోవాలంటున్నాడు దర్శకుడు హేమంత్ మధుకర్. 

 

చాలా కాలంగా ఊరించిన నిశ్శబ్దం ట్రైలర్ వచ్చేసింది. భాగమతి తర్వాత గ్యాప్ తీసుకొని అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. అనుష్క, మాధవన్ జంటగా నటించగా.. అంజలి.. షాలినీడే ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలను సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్ సన్ కీ రోల్లో కనిపించనున్నాడు. 

 

నిశ్శబ్ధం టీజర్.. ట్రైలర్ లో అనుష్క బొద్దుగా కనిపించినా.. పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా గోపీ సుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ టీజర్.. ట్రైలర్ కు ప్లస్ అయింది.  అరుంధతి, భాగమతి మాదిరి అనుష్క మరోసారి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ నే నమ్ముకుంటూ.. అదృష్టం పరీక్షించుకుంటోంది. 

 

నిశ్శబ్దం వాయిదాల మీద వాయిదాలు పడి ఏప్రిల్ 2న రిలీజ్ అవుతోంది. భాగమతి తర్వాత బొమ్మాళీ నటిస్తున్న ఏకైక సినిమా ఇది. ప్రస్తుతం చేతిలో మరో సినిమా లేదు. బొద్దుగా ఉన్నా ఛాన్సులు దక్కాలంటే.. నిశ్శబ్దం హిట్ అనుష్కకు ఎంతో అవసరం. 

 

మొత్తానికి అనుష్క లేడీ ఓరియెంటెండ్ మూవీస్ తోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. భాగమతి ద్వారా ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తిని రేపిన ఈ అమ్మడు నిశ్శబ్దం మూవీలో ఎలాంటి మాయచేస్తుందోని సగటు ప్రేక్షకుడు ఆసక్తిగా ఉన్నాడు. అరుంధతి, భాగమతిలా మెప్పిస్తుందో లేక తనలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తుందోనని ఆరాటపడుతున్నాడు.  మరి చూడాలి స్వీటీ.. ఏం చేస్తుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: