`పిల్లా నువ్వు లేని జీవితం` మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని కష్ట పడుతుంటాడు ఈయన. ఇక కెరీర్ మొదట్లో మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఏకాంగా డబల్ హైట్రిక్ ప్లాపులు రావడంతో సాయికి హిట్టు తప్పానిసరి అయిపొయింది. ఈ టైమ్లో కిషోర్ తిరుమలతో చేసిన చిత్రలహరి మంచి విజయాన్ని అందించింది.
ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి రోజు పండుగే సినిమా కూడా సూపర్ అయ్యాయి. అయితే ఇంతకు ముందు ఆరు ఫ్లాపులతో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి మరియు ప్రతి రోజు పండుగే సినిమా బిజినెస్లు కూడా చాలా తక్కువ అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’.
తనతో పాటు తన చుట్టూ ఉన్న కుర్రాళ్లను కూడా పెళ్లికి నో చెప్పేలా చేసే పాత్ర ఇది. ఇలాంటి కథ యూత్కు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. వాళ్లనే టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు కూడా. ఇక మరో విషయం ఏంటంటే.. కొత్త దర్శకుడితో ఈ సినిమాను చేసినా కూడా మంచి బిజినెస్ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. నైజాం ఏరియాలో దిల్రాజు తీసుకోగా ఉత్తరాంధ్రను యూవీ క్రియేషన్స్ వారు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
అలాగే అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా దాదాపుగా 20 కోట్లకు పైగానే బిజినెస్ చేసిందని అంటున్నారు. మరియు ఇతర రైట్స్ ద్వారా సులువగా అయిదు కోట్ల వరకు వస్తుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు ఐదు కోట్ల లాభాం వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఆ సారి మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బిజినెస్ విషయంలో సాయి ధరమ్ తేజ్ బాగానే సక్సెస్ అయ్యాడంటున్నారు.