ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కియా పరిశ్రమ వ్యవహారంలో పార్లమెంట్ లో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నప్పుడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్... వచ్చి అడ్డు తగిలారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు పక్కన ఉన్న ఎంపీలు అందరూ షాక్ గా చూసారు. అక్కడే ఉన్న ఒక మహిళా ఎంపీ కూడా ఆయన్ను అలాగే చూసారు. ఆ తర్వాత ఆమె హావ భావాలు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఆమె ఎవరో కాదు మన తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన నవనీత్ కౌర్. 

 

దాదాపు తెలుగులో 30 నుంచి 40 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఆమె. ఆ తర్వాత రాజకీయాల మీద ఆసక్తిగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. వివాహం తరువాత ఆమె రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టారు. లోక్సభ ఎన్నికల 2014 అభ్యర్థిగా congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన ఆనందరావు అడ్సుల్‌ను ఓడించి అమరావతి నుంచి ఆమె ఎంపిగా ఎన్నికయ్యారు.

 

ఇక ఆమెకు అక్కడ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓడిపోయినా గెలిచినా సరే ఆమె ప్రజల్లోనే ఉన్నారు. దీనితో నియోజకవర్గ ప్రజలు ఆమెను అక్కున చేర్చుకున్నారు. అటు భర్త ప్రోత్సాహం తో ఆమె రాజకీయాలలో కీలకంగా ఎదిగారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెను బిజెపిలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేసారు. అయినా సరే ఆమె మాత్రం బిజెపిలో చేరడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. ఇక పార్లమెంట్ లో కూడా నియోజకవర్గ వాణిని బలంగా వినిపిస్తూ ఉంటారు ఆమె. బిజెపిలో చేరి ఉంటే కేంద్ర మంత్రి అయ్యే వారని పలువురు అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: