ఒక పక్క కలెక్షన్ కింగ్ సల్మాన్ ఖాన్, మరో పక్క యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్  ఇద్దరూ  ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ లో ఒకే రోజు పెద్ద సినిమాల యుధ్దం  జరగబోతోంది. అయినా సరే మాకేం టెన్షన్ లేదు అంటూ బిందాస్ గా ఉన్నారు ఈ హీరోలు ఇంతకీ రీజనేంటో చూద్దాం.

 

బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లు అనుకుని మరీ ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే సీజన్ లో రంజాన్ రోజే ఇద్దరి సినిమాలు విడుదల చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు ఇద్దరు హీరోలు . అందుకే అసలు ఏమాత్రం తగ్గకుండా అనుకున్న రోజునే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. 

 

ఈ సంవత్సరం రంజాన్ కి  భారత్ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన సల్మాన్ ఖాన్.. మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకురాబోతున్నాడు. రీసెంట్ గా ప్రభుదేవాతో దబాంగ్ 3 సినిమా చేసి మంచి హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ .. మళ్లీ ప్రభుదేవా తోనే రాధే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా  షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే రంజాన్ రిలీజ్ అని అనౌన్స్ చేశాడు సల్మాన్.

 

ఇక యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా తన సినిమాని రంజాన్ రోజునే  విడుదల చేస్తున్నాడు. కాంచన రీమేక్ గా లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా రంజాన్  రోజునే రిలీజ్ అవుతోంది. ఇలా ఇద్దరు టాప్ హీరోలు పోటీపడుతూ ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేస్తుంటే కలెక్షన్లు తగ్గుతాయి, ఓపెనింగ్ రికార్డ్స్ మిస్ అవుతాయని ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతుంటే.. వీళ్లు మాత్రం మాకు పోటీ లేదు.. ఎవరొచ్చినా మా కలెక్షన్లు మాకుంటాయి అంటూనే.. 6వేల స్క్రీన్లు ఉన్నాయి. ఇద్దరం కలిసి పంచేసుకుంటాం...  అంటూ బిందాస్ గా చెబుతున్నారు ఈ స్టార్  హీరోలు.. అదే మన టాలీవుడ్ లో అయితే.. అమ్మో కలెక్షన్లు తగ్గిపోతాయ్ అంటూ తెగ గోల పెట్టేస్తారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: