ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించగా అది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలను వసూలు చేసి పెట్టింది. కానీ శర్వానంద్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన జాను సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి నిర్మాత అయిన దిల్ రాజు కి బాగా నష్టం కలిగించింది. దీంతో దిల్ రాజు తీవ్ర నిరాశలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే దిల్ రాజు జాను డిజాస్టర్ విషయాన్ని పక్కన పెట్టి నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న 'వీ' చిత్రాన్ని నిర్మించాడు. కానీ ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక సందిగ్దత లో దిల్ రాజ్ పడ్డాడట.



ప్రస్తుతం కొన్ని సినిమాలు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి మాత్రం కలెక్షన్లు లేక ఈగల కొట్టుకుంటున్నాయి. అందుకే తన 'వి' సినిమాని ఈ అన్సీజన్ లో విడుదల చేయకూడదని దిల్ రాజు భావిస్తుండగా... హీరో నాని మాత్రం ముందు అనుకున్నట్టుగానే మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని పట్టుబట్టాడట. దీంతో 'ఇదెక్కడి గోల, రా బాబు!!', అని దిల్ రాజు తల పట్టుకుంటున్నాడట.



ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేద్దామని హీరో నాని ని ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడట. హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ దాటికి అందరూ ఇళ్లల్లో కూర్చుంటున్నారు తప్ప సినిమా థియేటర్ లకి రావట్లేదని హీరో నాని దృష్టికి తీసుకొచ్చి నచ్చచెబుతున్నాడట. ఏది ఏమైనా ఒక సినిమాని ఏ టైం లో రిలీజ్ చేయాలో, ఏ ఏరియా లో రిలీజ్ చేస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతుందో అన్నీ తెలిసిన దిల్ రాజుకి... హీరో నానికి 'వీ' సినిమా రిలీజ్ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: