ప్రపంచంలో మీ టూ ఉద్యమం హాలీవుడ్ లో మొదలై తర్వాత బాలీవుడ్ కి చేరింది.  బాలీవుడ్ లో చేరింది.. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి తనూ శ్రీ దత్తా, కంగాన రౌనత్ లో గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు.  తనూ శ్రీ దత్తా అయితే ప్రముఖ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.  ఆ తర్వతా కంగనా రౌనత్ కూడా తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో వేధింపులకు గురి అయ్యానని అన్నారు.  ఇక తెలుగు లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉదమ్యమే తీసుకు వచ్చింది.  తమిళ నాట సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైర ముత్తు పై సంచలన ఆరోపణలు చేసింది.

 

ఇలా ఎంతో మంది నటీమణులు లైంగిక వేధింపులపై పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.  మీటూ ద్వారా సినీ పరిశ్రమలోని ఎందరివో బాగోతాలు బయటపడ్డాయి.  మీటూ వల్ల ఇండస్ట్రీకి ఎంతో మేలు జరిగిందని కాజోల్ వంటి నటీమణులు కూడా కితాబిచ్చారు. తాజాగా మీ టూ ఉద్యమం పై ప్రముఖ బాలీవుడ్ నటి కైరా అద్వాని సంచలన వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ మద్య అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.   

 

షాహిద్ కపూర్ సరసన ఈ హాట్ బ్యూటీ నటించి మంచి సక్సెస్ అందుకుంది.  తాజాగా మీ టూ ఉద్యమం కైరా తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.  మీటూ వల్ల పూర్తి ఫలితం రాలేదని వ్యాఖ్యానించింది. మీటూ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారుతాయని తాను భావించానని... అయితే ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. మార్పులు వస్తాయని కూడా తాను భావించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: