టాలీవుడ్ దర్శకులలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు మాస్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ ఉంటారు. మరికొందరు యాక్షన్ కామెడీ సినిమాలు అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇంకొందరు ప్రేమకథలు తీయడంలో, ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల కాలేజ్ కథల్ని, ప్రేమ కథల్ని, పొలిటికల్ ఫిలిమ్స్ ని తీసినప్పటికీ, శేఖర్ కమ్ముల అనగానే సున్నితమైన ప్రేమకథలే గుర్తుకొస్తాయి.

 

 

ఆనంద్ నుండి మొన్న వచ్చిన ఫిదా వరకు ఒక్కో ప్రేమ కథ ఒక్కోలా ఉంటుంది. ప్రతీ సినిమా గుండెలని హత్తుకుంటుంది. అయితే శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంత యువకుడిగా కనిపిస్తారట. అందుకోసం చైతన్య తెలంగాణ యాసని కూడా నేర్చుకున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూడబోతున్నామని అంటున్నారు.

 

 

అయితే ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ని జరుపుకుంటుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రం కోసం 8గంటల ఫుటేజీని షూట్ చేశాడట. రెండున్నర గంటల చిత్రం కోసం ఎనిమిది గంటల ఫుటేజీని తీశాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎడిటింగ్ టీమ్ ఈ చిత్రాన్ని ఎడిట్ చేసే పనిలో ఉన్నారట.  మొత్తం ఎనిమిది గంటల్లో రెండున్నర గంటల చిత్రంగా మలచడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడట. 

 

 

ఏషియన్ సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అన్ని పనులు ముగించుకుని ఈ చిత్రం మే ౨౯ న రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా కూడా ఫిదాలాగా మనల్ని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: