టాలీవుడ్ హాట్ హంక్ దగ్గుబాటి రానా మంచి యాక్టర్ గా నిరూపించుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా పలు వెరైటీ క్యారెక్టర్లు వేస్తూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం అరణ్య, విరాటపర్వం.. సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాక దర్శకుడు తేజ దర్శకత్వంలో రాక్షసరాజ్యంలో రావణాసురుడు సినిమా కూడా చేస్తున్నాడు. తేజ పుట్టినరోజు నాడు ప్రకటించిన రెండు సినిమాల్లో ఇదొకటి. తేజ్ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా తరహాలోనే ఇది కూడా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తికరమైన న్యూస్ ఒకటి రౌండ్ అవుతోంది.

 

 

ఈ సినిమాలో రానా సరసన ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. దీని కోసం తేజ హీరోయిన్ల వేటలో ఉన్నాడట. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా కాజల్, కేథరిన్ లు నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లనున తీసుకుంటున్నారట. కథ డిమాండ్ ను బట్టే ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ప్రాధాన్యం ఉందని అంటున్నారు. తేజ ఆమధ్య తీసిన సీత డిజాస్టర్ కావడంతో కొన్నాళ్లుగా సైలంట్ అయి.. రెండు కథలను సిద్దం చేశాడు. మరో సినిమా గోపీచంద్ హీరోగా అలివేలుమంగ వెంకటరమణ సినిమాను కూడా ప్లాన్ చేశాడు. అయితే వీటిలో ముందు ఏ సినిమా చేస్తాడనేది తెలియాల్సి ఉంది.

 

 

రానా తన కమిట్ మెంట్స్ లో భాగంగా హిరణ్యకశిప సినిమాను కూడా చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. మరి తేజ సినిమాలో రానాతో జత కట్టబోయే ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఈ సినిమాపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: