ఒకప్పుడు తనకు వరుస విజయాలను అందించి, మాస్ హీరోగా నిలబెట్టిన 'బి.గోపాల్' దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారని టాలీవుడ్ తాజా సమాచారం. ఈ కాంబినేషన్ లో మనం చూసుకుంటే, గతంలో "రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు" వంటి భారీ యాక్షన్ చిత్రాలు, భారీ విజయాలను నమోదు చేసాయి. మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకున్నాడేమో బాలయ్య.... వీరిరువురి కలయికలో మూవీ రాబోతుందని సోషల్ మీడియాలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బి.గోపాల్ చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఒకేలాంటి మూస కధలను తీయడం వలననే అయన ఫెయిల్ అయ్యారనే టాక్ టాలీవుడ్లో వుంది.. అది నిజం కూడాను.. ఎందుకంటే.. సినీ ప్రేక్షకులు ఒకప్పటిలా లేరు.. మాస్ సినిమాలకు ఇపుడు ఆదరణ తగ్గిందనే చెప్పుకోవాలి. ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.  

 

ఇక బాలయ్య గురించి అందరికి తెలిసినదే. అయన కూడా పెద్దగా ఆడియన్స్ నాడిని పెట్టుకోరు. తనకు తోచిన రీతిలో సినిమాలను చేసుకుంటూ పోతారు. అపుడెపుడో అయన, తన తండ్రి శ్రీ స్వర్గీయ నందమూరి తారక  రామారావు గారి మాటను (డైరెక్టర్ ఏం చెబితే అది చేయమని) తూచ అయన పాటించి.. అయన చేతులు కాల్చుకుంటారు. ఈ ధోరణే అయన ఆయన వరుస ఫెయిల్యూర్స్ కి కారణం అన్న అపోహలు లేకపోలేదు.

 

ఇపుడు నవతరం వచ్చి, కొత్తగా వుండే కథలను ఎంచుకుని హిట్ కొడుతున్న తరుణంలో ఇంకా ఈయన  మూస ధోరణిలో సాగే కథలతో సినిమాలు చేయడం అతనికి సినీ జీవితానికి అంత శ్రేయస్కరం కాదని, తెలుగు సినీ నిపుణుల మాట. మొన్నటికి మొన్న ఆయన కే.యస్ రవికుమార్ డైరెక్షన్లో చేసిన వరుస సినిమాలే ఇందుకు సాక్ష్యం.. అలాగే ఇపుడు లైన్లో వున్న బోయపాటి సినిమా కూడా అదే కోవలోకి పోతుందేమో అని సదరు అభిమానులు హడలెత్తిపోతున్నారట! 

మరింత సమాచారం తెలుసుకోండి: