టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మంచి జోష్ లోఉన్నారు.  పవన్ కళ్యాన్ తో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమేత తో మంచి విజయం అందుకున్నాడు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా ‘అలా వైకుంఠపురములో’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీలో ‘అల వైకుంఠపురములో’ చేరింది. అంతే కాదు మ్యూజికల్ హిట్ గా నిలిచింది.  ప్రస్తుతం త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ తో ఓ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. 

 

మూవీ తర్వాత ఆయన ఎప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీయాలని కథ సిద్దం చేసుకున్నట్లు సమాచారం.  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152 సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో నటించే ఛాన్సు ఉందని అంటున్నారు.  మరోవైపు మెగాస్టార్ తో మూవీ తీసేందుకు క్రిష్, హరీష్ శంకర్, వివివినాయక్ లు లైన్లో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం అయితే చిరంజీవి లేదా రామ్ చరణ్ తో అయినా ఓ మూవీ తీసేందుకు సిద్దంగా ఉన్నారట.

 

ఇందుకోసం ఆయన రామ్ చరణ్ కోసం కూడా మంచి కథ సిద్దం చేసుకొని ఉన్నట్లు సమాచారం.  మొత్తానికి రెండు కథలను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు మెగా హీరోలు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురములో మూడు సూపర్ హిట్స్ అందించారు.  ఇక పవన్ కళ్యాన్ తో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ అందించారు.  అయితే అజ్ఞాతవాసిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బొర్లా పడింది.    ఈ సారి చిరూతోగానీ .. చరణ్ తో గాని చేయడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: