గత కొద్దిరోజులుగా ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు మెగా స్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలోని ఒక ముఖ్య పాత్రలో నటించడానికి మరో మెగా హీరో రామ్ చరణ్ ను సంప్రదించగా ఆయన ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించనట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ను కోరగా ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ పనుల్లో చరణ్, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. 

 

అంతే కాకుండా ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ముందే ఆచార్య చిత్రం రిలీజ్ విషయంలో రాజమౌళి కి అభ్యంతరం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణాల దృష్ట్యా ఇప్పుడు కొరటాల శివ ఈ కీలక పాత్ర కోసం హీరో మహేష్ బాబు ను సంప్రదించగా ఆయన ఒకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సంక్రాంతి కానుకగా విడుదలయిన మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు చిత్రం ప్రీ రిలిజ్ ఫంక్షన్ కు చిరు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే దర్శకునికి ఒక చిక్కు వచ్చింది. మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు అనేసరికి హీరో మహేష్ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. 

 

కాబట్టి చిత్రంలో ఆయన నటించే పాత్ర కు ఏ మాత్రం ప్రాముఖ్యత తగ్గిన కూడా సూపర్ స్టార్ అభిమానుల నుంచి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అని అభిప్రాయపడుతున్నారట. అంతే కాకుండా పెద్ద హీరో కాబట్టి మహేష్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పరంగా కూడా దర్శకుడు కొరటాల శివ ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఇవన్నీ తెలిసి సినిమా రిలీజ్ కొంచెం ఆలస్యం అయిన పర్వాలేదు రామ్ చరణ్ కోసం వెయిట్ చేద్దాం అని చిరు సలహా ఇచ్చారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత ఆసక్తి రేపుతున్న ఆ కీలక పాత్ర లో నటించేది ఎవరా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: