వంటలక్క...సిల్వర్ స్క్రీన్ మీద ఈ పేరు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కార్తీకదీపం సీరియల్ తో ప్రస్తుతం బుల్లితెర మీద ఎవరికీ లేనటువంటి క్రేజ్ సంపాదించుకుంది నల్ల దీప పాత్ర. కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన పాత్రదారి ఈ వంటలక్క. కథ అంతా ఈ వంటలక్క చుట్టూనే తిరుగుతుంది.  ఈ సీరియల్ కు వస్తున్నటువంటి ఆదరణ అలాగే టీఆర్పీ రేటింగ్ దేనికీ రావడం లేదు. కొత్త సినిమాలకు మించిన రేటింగ్ ఈ వంటలక్క సీరియల్ కు వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వంటలక్కతో పాటు ఆమె కూతురు సౌర్య కూడా ఉంటుంది. ఇప్పుడు కార్తీకదీపం అభిమానులకు గత కొన్ని రోజులుగా టెన్షన్ మొదలైంది. అకస్మాత్తుగా వంటలక్క ఇంటి నుంచి మాయం అయిపోయింది.

 

ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక సీరియల్ లో అందరూ బాధ పడుతూ ఉంటారు. ఆమె కూతురు సౌర్య అయితే, పాపం కంటి మీద నిద్ర లేకుండా ఏడుస్తూనే ఉంది. దీంతో సీరియల్ లో ఎమోషన్స్ తారాస్థాయికి చేరిపోయాయి. సోషల్ మీడియాలలో వంటలక్కకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'నల్ల దీప మిస్సింగ్' అంటూ, 'ఆమె కూతురు సౌర్య మూడు ఎపిసోడ్స్ నుండి అన్నం తినకుండా ఏడుస్తూ ఉందని' నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేస్తూ అందర్ని నవ్విస్తున్నారు. 

అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కార్తీకదీపం సీరియల్ నుండి ప్రస్తుతం ఉన్న వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ను తొలగించారని తెలుస్తుంది. అయితే తన స్థానంలో మరో నటి రాబోతుందని సమాచారం. అందుకే ఆమె పాత్రను మిస్సింగ్ అయినట్లు సీరియల్ లో చూపిస్తున్నారని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు ఈ సీరియల్ కన్నా ఆ పాత్రకే ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. అటువంటి వంటలక్క పాత్రకు మరో నటిని తీసుకుంటే ఆ పాత్ర ఫీల్ పోతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయం వంటలక్క అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ఈ వంటలక్క మలయాళంలో 'సాల్మన్' అనే మూవీతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. బుల్లితెర మీదే ఇంత క్రేజ్ సంపాదించిన ఈవిడ వెండితెర మీద ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి మరి. అయితే వంటలక్క ఈ సినిమా కోసమే ఆ సీరియల్ వదిలేసిందా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: