శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత వస్తున్న తాజా బ్యూటిఫుల్ సినిమా లవ్ స్టోరీ. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా, ఆయన సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినీమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లోనే ఫీల్ గుడ్ సినిమా అని ముద్ర పడిపోయింది.  ప్యూర్ లవ్ స్టోరీస్‌‌‌ ను తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల తర్వాతే ఎవరైనా.. ఈయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఈయన నిర్మించే చిత్రాలలో ఎలాంటి వల్గారిటీ, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్‌ లు లేకుండా స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందిస్తారు. అదే స్వచ్ఛతను తెర పైన ఆవిష్కరిస్తారు శేఖర్ కమ్ముల.

 

 


గతంలో ఈయన హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్, ఫిదా లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలో ఎక్కడ చూసినా మనకు ప్రేమే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఆ పాత్రలను ఎంత అందంగా ఆవిష్కరిస్తారో తెలుస్తోంది. ఆయన చిత్రించే పాత్రలు అనుబంధాలను పెనవేసుకునేలా  ఉంటుంది. అసలు ఇలాంటి ఒక డైనమిక్ దర్శకుడి నుండి లవ్ స్టోరీలను ఎక్స్ పెక్ట్ చేసే ప్రేక్షకులు కోట్లలోనే ఉంటారు. 

 

 


అలాంటి దర్శకుడు నిర్మించే చిత్రం ను  ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ తోనే  సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ 'ఏ పిల్లా’ అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్‌.. పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేసింది. ‘ఏ పిల్లా’.. పరుగున పోదామా?? ఏ వైపో జంటగ ఉందామో’’ అంటూ సాగిన ఈ పాటను హరిచరణ్ పాడారు. ఈ పాటకు లిరిక్స్ ను చైతన్య పింగళి  అందించారు. పవన్ హెచ్ స్వరాలను పొందుపరిచారు.

 

 


ఫిదా చిత్రంలో శేఖర్ కమ్ముల సాయి పల్లవిని భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలంగాణ పోరిగా చూపించారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రంలో సాయి పల్లవిని ఎలా చూపిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఫిదా చిత్రంలో  ‘ఏ పిల్లగాడా’ సాంగ్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ ను అందుకుంది. మరిప్పుడు విడుదల చేసిన లవ్ స్టోరీ సినిమా నుండి ‘ఏ పిల్లా’ అనే పాట 'ఏ పిల్లగాడ' పాట లాగ బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా అని చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: