తెలుగు చిత్రసీమలో వారసుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొదటగా మెగా ఫ్యామిలీ గురించే చెప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలున్నారు. అయితే ఎంత మంది ఆ కుటుంబం నుండి వచ్చినా.. అందరికీ ఎంతో కొంత మార్కెట్ ఉంది. అలాగే హీరోగా నిలదొక్కుకోగలుగుతున్నారు కూడా. కానీ అందరిలోకి ఒకే ఒక్కడు మాత్రం ఇప్పటికీ విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. అతను మరెవరో కాదు స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్.

 

మెగా హీరోలందరిలో ఇప్పటి వరకు హిట్ లేని ఒకే ఒక్క హీరో అల్లు శిరీష్. శిరీష్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఎన్నో రోజులు అవుతున్నా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు హిట్ అనిపించుకున్నప్పటికీ అది డైరెక్టర్ ఖాతాలోకి పోయింది. శిరీష్ లాస్ట్ చిత్రమైన ఏబీసీడీ కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

 

దాంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఈ గ్యాప్ లో మంచి డైరెక్టర్ తో వస్తాడని అనుకున్నారు. కానీ అలా అనుకున్న అందరికీ శిరీష్ షాక్ ఇచ్చాడు. శిరిష్ ప్రస్తుతం రాకేష్ శశి అనే దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడట. రాకేష్ శశి గతంలో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

 

అలాగే మరో సినిమా జతకలిసే కూడా సేమ్ రిజల్ట్ తెచ్చుకుంది. ఇలా రెండు ఫ్లాపులు వెంట ఉన్న దర్శకుడితో సినిమా చేయడం అవసరమా మెగా అభిమానులు అని అడుగుతున్నారు. అసలే మార్కెట్ లేని శిరీష్ కి దర్శకుడు కొంచెమైనా ప్లస్ అవుతే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. మరి ఫ్లాప్ డైరెక్టర్ తో చేసే ఈ సినిమాతోనైనా శిరీష్ కి విజయం దక్కుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: