టాలీవుడ్ లో మాస్ మహరాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ వరుస గా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ మూవీతో సూపర్ సక్సెస్ సాధించిన రవితేజ తర్వాత నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి.  ఈ మద్య ఐవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘డిస్కోరాజా’  మూవీ కూడా ఘోర పరాజయం పొందింది.  దాంతో ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు రవితేజ.  ఈ నేపథ్యంలో బలుపు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపిచంద్ మలినేని తో ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో బలుపు హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది.  ఈ కాంబినేషన్ లో మరో మంచి హిట్ అందుకుంటారని భావిస్తున్నారు. 

 

రవితేజ  త్వరలో రమేష్ వర్మ దర్శకత్వంలో కొత్త మూవీ స్టార్ట్ చేయనున్నారు. రవితేజ వరుస పరాజయాలు పలకరిస్తున్నా స్పీడ్ మాత్రం తగ్గట్లేదు. వరుసగా సినిమాలకు సైన్ చేసుకుంటూ వెళుతున్నారాయన. ఇది కాకుండా త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతుందట.. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రవితేజ ఓకే చేసినట్లు తెలుస్తుంది.  ఇది 1980ల నేపథ్యంలో జరిగే కథగా ఉండనుంది. ఇందులో కథానాయకిగా శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయి. 

 

అన్నీ కుదిరితే త్రినాథరావ్ నక్కిన చిత్రంలో కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించవచ్చట. త్రినాథరావ్ ఇప్పటికే శృతితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ ఇదే జరిగితే ఇద్దరికీ ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ప్రస్తుతం రవితేజ, శృతిహాసన్ జంట మరో హిట్ కొడతరని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  ఒకప్పుడు బలుపు ఇప్పుడు క్రాక్ రెండు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్నటులు తెలుస్తుంది.  అంతే కాదు రవితేజ కు పోలీస్ పాత్రలు బాగా అచ్చొచ్చాయి. గతంలో విక్రమార్కుడు, పవర్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: