శర్వానంద్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. ఎప్పుడో శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్నాడు. అంతే మళ్ళీ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా హిట్ దక్కడం లేదు. పర్తీ సినిమాకి బాగా ఆశలు పెట్టుకుంటున్నాడు. అవికాస్తా అడియాశలు అవుతున్నాయి. పడి పడి లేచె మనసు యావరేజ్ అన్న టాక్ గాని ఒకరకంగా ఫ్లాపే అని చెప్పాలి. ఇక రణరంగం డిజాస్టర్ అని ఒప్పుకోవాల్సిందే. జానుని హిట్ అనాలో.. డిజాస్టర్ అనాలో అర్ధమవని పరిస్థితి. ఈ సినిమా సూపర్ అన్నారు. అందులో శర్వా నటన అదుర్స్ అనీ అన్నారు. అయినా సినిమా ప్లాప్ అయింది.

 

దాంతో ఇప్పుడు శర్వానంద్ తాజాగా వస్తున్న శ్రీకారం సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. కాని శ్రీకారం సినిమా కథకి, నితిన్ భీష్మ కథకి దగ్గర పోలికలు ఉన్నాయట. ఇది శర్వానంద్ కి పెద్ద షాక్. ఆ షాక్ నుండి తేరుకోవడానికే చాలా సమయం పట్టిందట. సేంద్రియ పద్దతులతో ఆర్గానిక్ పంటలు పండించే కుర్రాడిగా చదువుకున్న రైతుగా శర్వానంద్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీకారం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే సినిమా రషెస్ చూసిన శర్వా కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని తాజా సమాచారం. ఈ సినిమాలో శర్వా నటించిన ప్రేమ కథ కి సంబంధించిన ఎపిసోడ్ మ‌రీ డ‌ల్‌గా ఉంద‌ట‌. దాంతో ఆ సీన్స్ మళ్ళీ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా రాసుకుని రీ షూట్ చేస్తే మంచిద‌న్నఆలోచ‌న‌లో దర్శకుడుతో పాటుగా శర్వా ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. జాను సినిమాలో డీప్ లవ్ స్టోరీలో తన నటనా ప్రావీణ్యాని అంతా రంగరించిన శర్వాకి శ్రీకారంలోని ప్రేమ కథ అంతగా ఎక్కలేదని.. అందుకే మళ్ళీ కొత్తగా ఈ ప్రేమ కథ గురించి ఆలోచిస్తే బావుంటుందని ఫీలవుతున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. పాపం శర్వానంద్ టైం ఏంటో ఇంత బ్యాడ్ గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: