సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రకటించాడు. వంశీ మహేష్ బాబు కోసం కథ కూడా సిద్ధం చేశాడు. కానీ సడెన్ గా మహేష్, వంశీల కాంబోలో సినిమా క్యాన్సిల్ అయింది. అందుకు కారణం వంశీ చెప్పిన కథ మహేష్ బాబు కి నచ్చకపోవడమే. ఇందులో ఇంకో కారణం ఏమీ లేదు. కానీ జనాలు మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు మీడియా వాళ్ళు కూడా తోచింది రాసేస్తున్నారు.

 

ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు తో మరొక డైరెక్టర్ సినిమా కోసం ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పుకుంటున్నారు. అతనే గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన పరశురామ్. వంశీ తో సినిమా క్యాన్సిల్ అవగానే పరశురామ్ తో సినిమా ఉంటుందని, దానికి సంబంధించిన కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో కొంతవరకే నిజముందని అంటున్నారు. వాస్తవంగా పరశురామ్ మహేష్ బాబుని కలిసి కథ వినిపించాడట. కాని అక్కడే మ్యాటర్ ఆగిపోయింది గాని అంతకు మించి ముందుకు వెళ్ళలేదట. 

 

అయితే ఈ విషయంలో జనాల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అసలు పరశురామ్ తో మహేష్ బాబు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా ..! ఆయన నెక్స్ట్ సినిమా ఏది. ఒక పక్క కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. మరో వైపు అనిల్ రావి పూడితో ఎఫ్ 3 లో నటిస్తున్నాడన్న టాక్ కూడా నడుస్తోంది. దీంతో జనాలే కాదు మహేష్ బాబు కూడా కన్‌ఫ్యూజన్ లో పడ్డాడట. మరి ఈ కన్‌ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం మీరు కన్‌ఫ్యూజ్ అవడం ఏం బాగాలేదండి అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: