మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో... ఈ ఏడాది సంక్రాంతి కి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో ఇది ఒక్కటే చెప్పుకోదగిన హిట్ అయింది అనేది వాస్తవం. 

 

అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. టాలీవుడ్ లో కొన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. టాలీవుడ్ లో మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ జనం ఈ సినిమాలో పాటలకు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది మరి. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చెయ్యాలని కూడా చూస్తున్నారు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు అక్కడ. 

 

అక్కడ కూడా నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఈ సినిమా అక్కడ నిర్మించడం ఖరారు అయిపోయింది అంటున్నారు టాలీవుడ్ జనం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఉన్న ప్రతీ పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం టిక్ టిక్ లో ఈ సినిమా పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. యుట్యూబ్ లో కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: