భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది నటి శ్రీదేవి.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటించిన ఆమె బాల నటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ఒకప్పుడు శ్రీదేవి చిత్రాలంటే యూత్ థియేటర్లకు క్యూ కట్టేవారట.  స్టార్ హీరోలకు సమానంగా ఈ అందాల తారకు పేరు వచ్చింది.  తెలుగు లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ హిమ్మత్ వాలా చిత్రంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  శ్రీదేవి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.  ఆ మద్య దుబాయ్ లో శ్రీదేవి అకాల మృత్యువడిలోకి వెళ్లిపోయింది. 

 

అయితే ఆమె చిరకాల కోరిక తన పెద్ద కూతురు ని హీరోయిన్ గా చూడాలని.. కానీ అది నెరవేరలేదు.  శ్రీదేవి వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్.  ఆ తర్వాత ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.  కేలవలం వెండితెరపైనే కాదు ఫ్యాషన్ షోలు, ఇతర ఫోటో షూట్స్ తో జాన్వీ కపూర్ సందడి చేస్తుంది. తాజాగా నాసిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని, 'జింగ్ జింగ్ జింగాత్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టింది. ఫ్యాన్స్ కోరిక మేరకు 'ధడక్' చిత్రంలో ఈ సాంగ్ కు ఆమె వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి.

 

తన అందం, నటనతో 'ధడక్' చిత్రంతో అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న జాన్వీ కపూర్. సెలబ్రెటీల కూతుళ్లు నటీమణులుగా వస్తున్నారు.. వారికి నటన రాకుకున్న సినీ బ్యాగ్ గ్రౌండ్ తో రాణిస్తున్నారని ఆమద్య విమర్శలు వచ్చాయి.. కానీ అనుకునే వారు అనుకుంటారు.. కానీ నటన లేకుండా ప్రేక్షకులు ఆదరించని జాన్వీ గట్టిగానే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' చిత్రంలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇందులో రణవీర్ సింగ్ హీరో, వచ్చే సంవత్సరం క్రిస్మస్ కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మొగల్ సామ్రాజ్య కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: