సన్నజాజి  అందాలకు కెరాఫ్ అడ్రస్ ఇలియానా. ఒకప్పుడు తన జీరోసైజ్ అందాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను ఒక ఊపు ఊపేసింది. ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అసలైన హొయలున్న  అందం అంటే ఇలాగే ఉండాలేమో అన్నట్లుగా ఇలియానా అందం ప్రభావితం చేసింది . ఇక ఈ అమ్మడి అందానికి అటు  దర్శకనిర్మాతలు కూడా బాగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలను ఇచ్చేశారు. వరుస అవకాశాలు దక్కించుకుని... టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది ఇలియానా. ఆ తర్వాత ఏమైందో కానీ టాలీవుడ్కి ఒక్కసారిగా దూరమైపోయింది. ఇక కొన్నేళ్ల తర్వాత రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ అమ్మడి అందాలకు అందరూ షాక్ అయ్యారు. అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేని విధంగా లావెక్కింది  ఈ ముద్దుగుమ్మ. ఇక సన్నజాజి లాంటి అందాలు కనిపించకపోవడంతో అటు అభిమానులు కూడా బాగా ఫీల్ అయిపోయారు. 

 

 అయితే చాలా రోజుల తర్వాత ప్రస్తుతం ఇలియానా ఒక మంచి ఆఫర్ ని పట్టేసింది అనే వార్తలు టాలీవుడ్ ఫిలింనగర్ లో  చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ పింక్ రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 21 న చివరి షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోండగా...  దిల్ రాజు బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతిహాసన్ ముచ్చటగా మూడోసారి వకీల్ సాబ్  సినిమాలో నటించబోతుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 

 

 అయితే వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది శృతిహాసన్ కాదు ఇలియానా అనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. శృతిహాసన్ కు బదులు ఇలియానాను తీసుకోవాలని సినిమా బృందం భావిస్తున్నట్లు సమాచారం. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఒకవేళ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమే అయితే... ఈ అమ్మడికి టాలీవుడ్లో మళ్లీ మంచి కాలం మొదలైనట్లే అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ రేంజ్ లో అంచనాలు ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో ఇల్లీ బేబీ ఛాన్స్ కొట్టేస్తే కెరీర్ మళ్లీ టాలీవుడ్లో గాడిలో పడ్డట్లే  అవుతుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: