ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరో గా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు తాను నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అన్న విషయం తెలిసిందే. అయితే అల్లుడు శీను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం దురదృష్టం వెంటాడుతూనే ఉంది ఈ యువ హీరోకి . ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా... ఎన్ని విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. సిక్స్ ప్యాక్ చేసిన... కండలు పెంచిన.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన... ఇలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది మాత్రం సరైన విజయం సాధించలేకపోయాడు . 

 

 దీంతో ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మొన్నటికి మొన్న రాక్షసుడు అనే  ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు  బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే మామూలుగా టాలీవుడ్ లో ఎక్కువగా టైటిల్స్ విషయంలో హీరోలు దర్శకులు ఎంతో సెంటిమెంట్ ఫాలో అవుతారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే తోట అవుతుంది ఫిక్స్ చేయబోతున్నారట. అయితే ఈ అల్లుడు అనే టైటిల్ సెంటిమెంట్ వల్లే పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో అల్లుడు శీను అని వచ్చిన సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. 

 

 ఇక అదుర్స్ అనే సినిమా ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా అన్న విషయం తెలిసిందే. ఈ రెండూ కలిపి రంగరించి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట చిత్రబృందం. అయితే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ సినిమాలో నభా నటేష్ అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సోనూసూద్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. మరి అంతకుముందు రాక్షసుడు సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి అల్లుడు అదుర్స్ సినిమా తో అదే ఊపు కొనసాగిస్తాడ అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: