‘కార్తికేయ’ చిత్రం ద్వారా పరిచయమైన నూతన డైరెక్టర్ చందు మొండేటి. ఇక ఆ సినిమాతో టాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకున్నాడు. తొలి చిత్రంతోనే తనదైన శైలిని చూపించారు. పామును హిప్నటైజ్ చేయడమనే కొత్త యాంగిల్ తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌ గాడిలో పడింది.  ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోంది. ‘కార్తికేయ 2’ పేరిట వస్తోన్న ఈ సినిమాను మార్చి 2న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంబించారు. సినిమా ప్రారంభానికి ముందే ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేయడం తెలిసినదే.

 

దర్శకుడు చందూ సినిమా కథకు తగ్గ లొకేషన్స్ వెతికే పనిలో బిజీగా వున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ సీక్వెల్ లో హీరోయిన్ స్వాతి నటిస్తోందని ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ పేర్కొన్న విషయం అందరికి విదితమే కదా. ఇక మొదటి భాగంలో స్వాతి పాత్రకు ఈ సీక్వెల్ లో కొనసాగింపు ఉంటుందని వినికిడి. ఇక ఈమె మొదటి భాగానికి ఒక ఎసెట్ అని చెప్పుకోవాలి. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కార్తికేయ 1 లో అదర గొట్టింది. ఇక సీక్వెల్ లో కూడా తన మార్క్ ను చూపించ బోతుంది.

 

ఇకపోతే... ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ కూడా ఉంటుందని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ సెకండ్ హీరోయిన్ కోసం గాలిస్తున్నారట. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని మనకు ఇట్టే తెలిసి పోతుంది. ఇక్కడ అసలు చిక్కు ఏమంటే... స్వాతి పాత్ర మెయిన్ హీరోయిన్ తరహాలో ఉంటుందా లేక సెకండ్ లీడ్ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

 

అయితే ఈ పార్ట్ 'కార్తికేయ 2' ను ఈ ఏడాది దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సదరు కార్తికేయ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొత్త విషయం ఏమంటే... ఈ సినిమాలో నిఖిల్ కూడా తన వంతు డబ్బు సాయం చేయబోతున్నాడట.. అదేనండి... వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ అన్న మాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: