టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీను వైట్ల.  తెలుగులో నీకోసం సినిమాతో ప్రస్ధానం మొదలు పెట్టి ‘ఆనందం’ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  సొంతం, వెంకి, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఆ తర్వాత ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ తర్వాత గత ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాతో భారీ డిజాస్టర్స్ పొందాడు. దాంతో ఇక శ్రీను వైట్ల కెరీర్ అయిపోయిందని రక రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.  తాజాగా ఆయన గతంలో మంచు విష్ణు తో తీసిన ‘ఢీ ’ కి సీక్వెల్ గా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు.  

 

మూవీ తర్వాత భక్త కన్నప్ప తీయబోతున్నట్లు ప్రకటించారు.  తాజాగా ఢీ మూవీ సీక్వెల్ గా ఢీ 2 తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మంచు విష్ణు స్పందించారు.  ఢీ 2 సీక్వెల్ రాబోతుందని.. చాలా మంది సన్నిహితులు, ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. శ్రీను వైట్ల నాకు అన్నటాంటి వారు.. ఢీ 2 గురించి ఆయన్ని అడిగితేనే మంచిది. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.

 

అయితే హీరో విష్ణు చేసిన ట్విట్ ఇప్పుడు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ లో పెట్టినా.. మరోవైపు శ్రీనువైట్ల ఢీ 2 చిత్ర కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుంది.  అయితే ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఈ ఇద్దరికీ కొంత కాలంగా ఏది కలిసి రాలేదు.. ఒకవేల ఇది నిజమైతే మంచి హిట్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.  మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: