ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సినిమా ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమాసినిమా అయినా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సినీ జనం. దర్శకులు కూడా సినిమా షూటింగ్ సమయం నుంచే సోషల్ మీడియాకు ఎక్కువగా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు అందరు హీరోయిన్లు, హీరోలు ఇదే పని మీద ఉన్నారని అర్ధమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది ఎక్కువగా కనపడుతుంది. 

 

బాలీవుడ్ లో సోషల్ మీడియాకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటూనే ఉంది. మన తెలుగులో మాత్రం హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువగా సినిమాలకు ప్రచారం చేస్తున్నారు. చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తమ సినిమాలకు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ప్రచారం జరుగుతుంది. ఇక అవకాశాలు కూడా అదే స్థాయిలో వస్తాయని హీరోయిన్లు ఎక్కువగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లకు దర్శకులు కూడా షరతులు ఎక్కువగా పెడుతున్నారని అంటున్నారు. 

 

హీరోయిన్ కి అవకాశం ఇవ్వాలి అంటే కచ్చితంగా సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తున్నారని అప్పుడే అవకాశం ఇస్తున్నారని అంటున్నారు. ఇక హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకుని ఎక్కువగా తమ స్కిన్ షో చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా యూత్ లో సినిమాకు క్రేజ్ పెంచవచ్చు. అందుకే హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. రష్మిక మంధనా, పూజా హెగ్డే కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నారు. వారిని చూసి ఇతర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం ఎలా చెయ్యాలో నేర్చుకునే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: