అవును, సూపర్ స్టార్ మహేష్ బాబు ఉగాది రోజున తన అభిమానులకు కొత్త రుచిని తినిపించబోతున్నాడు.  వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ, టాలీవుడ్లో దూసుకెళుతున్నారు మహేష్ బాబు. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రికార్డుల మోత మోగించారు. ఇక దీని తరువాత నెక్స్ట్ మూవీ వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది.

 

అందువలన దీని తర్వాత చేయాలనుకున్న సినిమాను ముందుకు లైన్ లోకి తీసుకొచ్చారు సూపర్ స్టార్. డైరెక్టర్ పరశురామ్ తో సినిమా చేసేందుకు కమిట్ అయిపోయారు బాబు. ఇక గీత గోవిందం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పరశురామ్.. మహేష్‌తో ఎలాగన్నా హిట్ కొట్టే దిశగా స్క్రిప్ట్ చాలా పవర్ ఫుల్ గా రెడీ చేసాడని వినికిడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా ఊపందుకున్నాయట. ఈ నేపథ్యంలో ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ఆరంభించ బోతున్నారని సమాచారం

 

సో.. ఈ ఉగాది రోజున తన అభినములకు మహేష్ సరికొత్త తీపిని తినిపించనున్నారు. ఇక అదే రోజునే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాల లిస్ట్ విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు ఫండ్ చేయబోతున్నారు. ఈ సినిమా లో మహేష్ జేమ్స్ బాండ్ తరహా రోల్ చేయబోతున్నట్లు వినికిడి. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడం విశేషం. 

 

సదరు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఇక మహేష్ బాబు మన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఇటీవల ఓకే చెప్పారనే విషయం అందరికి విదితమే. ఈ సినిమాకు  మహేష్ అనగానే మరింత హైప్ చేకూరుంది. ఈ సినమాలో మహేష్ విద్యార్థి సంఘ నాయకుడిగా నటిస్తున్నారని వినికిడి. ఇక సూపర్ స్టార్ అండ్ మెగా స్టార్ కలయిక కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: