టాలీవుడ్ లో తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ రీతు వర్మ జంటగా తెరకెక్కించిన పెళ్ళి చూపులు సినిమాతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని అందరూ అనుకునేలా చేశాడు. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ కి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. దర్శకుడిగా లాంగ్ టైం ఇండస్ట్రీలో ఉంటాడనుకుంటే ఇంతలోనే అందరికి షాకిచ్చాడు ఈ కుర్ర దర్శకుడు. దర్శకత్వం నుండి నటన వైపు దృష్ఠి మళ్ళి హీరో అవతారం ఎత్తాడు. పెళ్ళి చూపులు వంటి సూపర్ హిట్టిచ్చినందుకు ఏకంగా విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ కోసం నిర్మాతగా మారాడు. తరుణ్ భాస్కర్ తో సినిమాని నిర్మించాడు.
ఆ సినిమా విజయ్ కి గట్టి షాకే ఇచ్చింది. సేఫ్ జోన్ లో పడ్డాడనుకుంటూనే నిర్మాతగా దెబ్బ తిన్నాడు. అంతేకాదు తరుణ్ భాస్కర్ కి ఈ సినిమాతో నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. డైరెక్టర్ గా సక్సస్ కాకుండానే మళ్ళీ హీరోగానా అంటూ కామెంట్స్ పడ్డాయి. అయినా తరుణ్ భాస్కర్ ఇవేమి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అందుకే వెరైటీగా టీవీ హోస్టు అవతారం ఎత్తబోతున్నాడు. టీవీ షోలో దర్శకులను ఇంటర్వ్యూ చేస్తాడట. ఈ షో పేరు 'నీకు మాత్రమే చెప్తా' అని పెట్టాడు.
ఇక ఇప్పటికే ఈ షో లో భాగంగా పలువురు దర్శకులతో ఇంటర్వ్యూలు కూడా చేశారట. ఈ శనివారం నుంచినే ఒక చానల్ ఈ షో ప్రారంభం కాబోతోందని తాజా సమాచారం. దర్శకులతో మాట్లాడి.. వారు వివిధ సినిమాల సందర్భాల్లో ఎదుర్కొన్న అనుభవాలను ఇందులో చూపించబోతున్నాడట. అయితే గత కొంతకాలంగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఎక్కువైపోయాయి. అనేక మంది ప్రముఖ దర్శకుల ఇంటర్వ్యూలు నెట్ లో ఉన్నాయి. అయితే ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి చాలామందికి విసుగొచ్చి రావడం లేదన్న టాక్ వినిపిస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో తరుణ్ భాస్కర్ షో ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.