నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్  బ్యానర్ పై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్  అప్ డేట్ ని దర్శకుడు బోయపాటి కాసేపటికే క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపారు. 

 

మా సినిమాకు సంబందించిన గ్రాండ్ ఎమోషనల్ సీక్వెన్స్ ని సక్సెస్ఫుల్ గా ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పూర్తి చేసాము, అలానే రెండవ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ మొత్తం ఎదురుచూస్తోంది అంటూ బోయపాటి పోస్ట్ చేసారు. గతంలో బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ మాదిరిగా ఈ సినిమా కూడా పలు ఎమోషనల్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో చాలా రోజుల క్రితమే ప్రారంభం కావలసి ఉందని, అయితే సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పుల వలన మరింత ఆలస్యం అయిందని అంటున్నారు. 

 

ఇక సినిమాలో బాలయ్య రోల్ ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఎప్పటినుండో బాలయ్యను తమ ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ విధంగానే ఉంటుందని టాక్. ఇక సినిమా ఖర్చు విషయమై నిర్మాత రవీందర్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని, సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్స్, ఫైట్స్ వంటివి ఎంతో అదిరిపోతాయని అంటున్నారు. మొత్తంగా మంచి క్రేజ్ తో ప్రారంభం అయిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: