యంగ్ హీరో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తడం కు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రెడ్ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఆకట్టుకునే థ్రిల్లింగ్, సస్పెన్స్ యాక్షన్ సీన్స్ తో దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి తీస్తున్నారు. 

 

అమృత అయ్యర్, నివేత పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు నువ్వే నువ్వే లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఇకపోతే నేడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని నేడు మరొక్కసారి కన్ఫర్మ్ చేసింది సినిమా యూనిట్.  గత కొద్దిరోజలుగా ప్రపంచవ్యపథంగా కరోనా వైరస్ తో ప్రజలు వణికిపోతుండగా, దానికి భయపడి కొందరు దర్శక, నిర్మాతలు తమ సినిమాలు వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. 

 

అయితే మా సినిమా యూనిట్ ఆ కరోనా మహమ్మారికి ఏ మాత్రం భయపడి వెనకడుగు వేసేది లేదని, అలానే ముందుగా అనుకున్న విధంగా తమ సినిమాని ఏప్రిల్ 9న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోకి తీసుకువస్తాం అని ఒక అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా యూనిట్ సభ్యులు. ఇక గతంలో హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన నేను శైలజ సినిమా మంచి హిట్ కొట్టగా, ఆపై వచ్చిన ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమా యావరేజ్ గా ఆడింది. మరి ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ రెడ్ సినిమా ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: