యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీలో ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఎంతో సక్సెస్ఫుల్ గా ముగిసిందని, అలానే అతి త్వరలో ఈ సినిమా తాలూకు తదుపరి షెడ్యూల్ ని యూరోప్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసాం అని సినిమా యూనిట్ నిన్న ఒక ప్రకటన ద్వారా తెలిపింది. 

 

ఇక ఈ సినిమాకు టైటిల్ గా జాన్ అని గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా టైటిల్ ని ఓ డియర్ అని నిర్ణయించారని, అలానే టైటిల్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రాబోయే ఉగాది పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై సినిమా యూనిట్ కసరత్తు ప్రారంభించిందని అంటున్నారు. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన గొప్ప ప్రేమకథగా పలు యాక్షన్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. 

 

కృష్ణంరాజు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ మూవీ ప్రేమ పావురాలు ఫేమ్ భాగ్య శ్రీ ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కృష్ణంరాజు ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, టైటిల్ కూడా ఉగాది రోజున ప్రకటిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ రోజు అది మరింత పెద్ద పండుగ అవుతుందని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: