దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కంప్లీటవగానే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ మాత్రం తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. వరుసగా రోజుకో వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత నటించబోయో సినిమాడైరెక్టర్ తోనే ..ఇప్పటికే కథా చర్చలు కూడా మిగిశాయట అన్న వార్తలు జోరుగా వస్తున్నాయి.

 

ఇప్పటికే చరణ్ కు గౌతమ్ తిన్ననూరి నుండి మొదలుకుని సుజీత్ వరకు పలువురు దర్శకులు కథలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిలో కొన్ని కథలకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఏ డైరెక్టర్ తో ముందు సినిమాను చేయబోతున్నాడు అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒక వైపు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే మరో వైపు ఆచార్య నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్నాడు చరణ్. ఇప్పటికే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న చరణ్ అందుకే తన నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదని సన్నిహిత వర్గాల ద్వారా అందిన సమాచారం.

 

ఈ లెక్కన చూస్తే చరణ్ ఇప్పుడప్పుడే తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. సైరా కి తలెత్తిన సమస్యల కారణంగా ఆ సినిమా అనుభవంతో చరణ్ ఈ సారి రిస్క్ చేయదలచుకోవడం లేదని కూడా అంటున్నారు. లేటయినా ఆచి తూచి అడుగులు వేయాలనే నిర్ణయించుకున్నాడట. అందుకే ఎవరెన్ని చెప్పినా తన నెక్స్ట్ సినిమాని తొందరపడి పలానా డైరెక్టర్ తో అని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదట. ఒకరకంగా ఇది సరైన నిర్ణయమే అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: