మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకోసం మహేష్ బాబు కి 40 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేశారు. అంతేకాదు మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతకముందు మహేష్ బాబు పూజా హెగ్డే కలిసి మహర్షి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్నారు. అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే కథ నచ్చక మహెష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడు. ఇక సరిలేరు షూటింగ్ సమయంలోనే అనిల్ రావిపూడికి 'ఎఫ్3' లో నటిస్తానని మాటిచ్చారు. అన్నట్టుగానే మహేష్ బాబు ఎఫ్ 3 లో కమిటయ్యారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల సినిమా లో మహేష్ బాబు 25 రోజులు డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీటయ్యాక ఎఫ్ 3 లో జాయిన్ అవుతారడట.

 

ఇక తాజాగా అమెరికాలో ఉన్న మహేష్ బాబుతో చిరంజీవి ఫోన్ లో చాలాసేపు మాట్లాడారట. ఎప్పుడెప్పుడు మహేష్ బాబు వచ్చి చిరంజీవి తో జాయిన్ అవుతాడో అన్న కుతూహలాన్ని చిరంజీవి మహేష్ బాబు దగ్గర వెల్లడించారట. అంతేకాదు భారీ మల్టీ స్టారర్స్ బాలీవుడ్ సినిమాల గురించే చెప్పుకునే వారు. కాని ఆచార్య సినిమాతో మన సినిమా గురించి చెప్పుకోవాలని చిరు మహేష్ తో అన్నారట. అందుకు మహేష్ తప్పకుండా సార్ మనం సినిమా చేస్తే కొత్త రికార్డ్ లు క్రియోట్ అవ్వాల్సిందే అన్న ధీమాని చిరు దగ్గర తెలిపారట. అంతేకాదు ఈ కథ గురించి ఇద్దరు ఫోన్ లో చాలాసేపు చర్చించుకున్నారట. 

 

అంతేకాదు కొరటాల శివ మేకింగ్ స్టైల్ గురించి చాలాసేపు ముచ్చటించుకున్నారట. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి అమెరికాలో ఉన్న మహేష్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడతారన్న విషయాన్నే ఎవరూ ఊహించరు. అంతేకాదు ఇద్దరు కలిసి చేస్తున్న ఆచార్య సినిమా గురించి ఇంత ఆతృతగా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని ఏ ఒక్కరు ఊహించరు. అలా ఊహించిన వాళ్ళు మెగా అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్సే కాదు జీనియస్ కూడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: