మంచు లక్ష్మీ... టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు కుమార్తె. అంత వరకు కొందరికి తెలుసు... కాని ఆమె మాత్రం ఒక యాంకర్ గా తాను మాట్లాడే మాటలతో ప్రపంచానికి పరిచయం అయింది. మోహన్ బాబుని మర్చిపోయి మంచు లక్ష్మీ ని మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. మంచు లక్ష్మీకి కుటుంబ ప్రోత్సాహం ఉందో లేదో తెలియదు గాని ఈమె మాత్రం బుల్లి తెర యాంకర్ గా ఒక ఊపు ఊపుతుంది. ఈమె వయసు ఇప్పుడు 50 కి దగ్గరగా ఉంది అయినా సరే ఈమెలో ఉండే కొన్ని కోణాలు మాత్రం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ నే ఉంటాయి. 

 

అమెరికన్ స్లాంగ్ అంటే ఈమె కి ప్రాణం... అందుకే ఆమె యాంకరింగ్ చేసే సమయంలో దాని ప్రస్తావన లేకుండా మాట్లాడే ప్రయత్నం చేయదు. ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ లో మంచు లక్ష్మి యాంకర్ అయితే, ఆ సందడే వేరు. ఇక ఈమెలో కాస్త మానవత్వం కూడా ఎక్కువే. సమాజం కోసం జెమిని టీవీ సహకారంతో ఒక షో చేసారు. ఆ షో ద్వారా ఎందరో జీవితాలు బాగు పడ్డాయి. ఆ షో ద్వారా సామాన్యుడి కష్టాలు, పేదల కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఆమె చూపించారు. 

 

సోషల్ మీడియాలో ఈమె మాట్లాడే మాటలకూ ప్రత్యేక అభిమానం సంఘం ఒకటి ఉంది. ఆమె ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ... ఆర్ షుడ్ బీ రోలింగ్ అన్న మాట ఇప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తుంది. తాజాగా ఆమె కరోనా వైరస్ విషయంలో ఇలాగే మాట్లాడి విమర్శలు ఎదుర్కొంది. అందులో కూడా ఆర్ ని కింద పడి డొల్లెలా చేసింది. ఆమెకు టాలీవుడ్ లో బుల్లి తెర యాంకర్ గా పెద్ద డిమాండ్ లేకపోయినా అవార్డ్స్ ఫంక్షన్ లాంటి వాటిల్లో మాత్రం ఆమెకు మంచి డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: